తిరుపతి : తిరుపతి కోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా గురువారం ముత్యాల (Pearls) తలంబ్రాల ఊరేగింపు ఘనంగా జరిగింది. టీటీడీ (TTD) పరిపాలనా భవనంలోని ఖజానా విభాగంలో అధికారులు ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటిని అంబారీల(Elephants) పై ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ కోదండరామాలయ ప్రధాన అర్చకులు ఆనందకుమార్ దీక్షితులకు అందించారు.
ఈ ఊరేగింపు తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు, గోవిందరాజస్వామి ఆలయ దక్షిణ మాడ వీధి, బజారు వీధి గుండా ఆలయానికి చేరుకుంది. గురువారం సాయంత్రం జరిగే సీతారాముల కల్యాణంలో ఈ ముత్యాల తలంబ్రాలను వినియోగిస్తామని ఆలయ అర్చకులు వెల్లడించారు.
ఒంటిమిట్టలో వేణుగానాలంకారంలో దర్శనం
కడపలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి( KodandaRamaswamy ) బ్రహ్మోత్సవాల్లో గురువారం స్వామివారు వేణుగానాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి నిర్వహించిన ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.