అమరావతి : శ్రీకాకుళం జిల్లా నాగావళి నదిలో పడి పాలిటెక్నిక్ విద్యార్థి మృతి చెందాడు. ముగ్గురు స్నేహితులతో కలిసి నదిలో స్నానం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. విద్యార్థి నీట మునగడంతో అతడి పాటు వచ్చిన మరో ఇద్దరు అక్కడి నుంచి పారిపోయారు.
వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా అగ్నిమాపక శాఖ , పోలీసులు సంయుక్తంగా గాలింపు జరిపి విద్యార్థి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.