అమరావతి : ఏపీలోని పార్వతీపురం జిల్లా సాలూరు పోలీసుస్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి గది గోడలు, అద్దాలు ధ్వంసమయ్యాయి. కొన్ని నెలల క్రితం పోలీసు స్టేషన్ పరిధిలో స్వాధీనం చేసుకున్న బాణ సంచాను సీజ్ చేసి పోలీస్స్టేషన్లో భద్ర పరిచారు. ప్రమాదవాశాత్తు భారీ శబ్ధంతో బాణసంచా పేలడంతో స్టేషన్లో మంటలు చెలరేగాయి.
పేలుడు దాటికి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను ఆర్పివేశారు. ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.నేరస్థుల నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలను, వస్తువులను, సంబంధించిన పదార్థాలను కోర్టులో కేసు పూర్తయ్యేంతవరకు పోలీసుస్టేషన్లోనే భద్రపరుస్తారు.