అమరావతి : ఏపీలోని విశాఖలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ద్విచక్రవాహనదారులు మృతి చెందారు. విశాఖ మధురవాడ బొరవానిపాలెం జాతీయ రహదారిపై గ్యాస్ లోడ్ లారీ(Gas load lorry) అతివేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు పెదవాల్తేరు వాసులు మణి, నిరంజన్గా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.