అమరావతి: తిరుమలలో ముగ్గురు దర్శన టికెట్ల దళారులపై టిటిడి విజిలెన్స్ అధికారులు తిరుమలలోని టు టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుపతికి చెందిన రెడ్డి ఈశ్వర్, బాబు నాయక్, సుదర్శన్ రెడ్డిలు టాక్సీ డ్రైవర్లు దళారులుగా వ్యవహరిస్తూ రూ.3200 నగదు తీసుకుని నకిలీ టిక్కెట్లను విక్రయించినట్లు మంగళూరుకు చెందిన వై.హెచ్. వెంకటేష్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. యాత్రికుల ఫిర్యాదు మేరకు టిటిడి విజిలెన్స్ అధికారులు ముగ్గురు దళారులపై పోలీసులకు ఫిర్యాదు చేయగా… తిరుమల టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
అంతేకాకుండా తిరుమల ఏటిసి సర్కిల్లో వద్ద బ్రేక్ దర్శనం టిక్కెట్లు వెరిఫై చేస్తుండగా ఓ టికెట్పై అనుమానం వచ్చి టిటిడి విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. ఇందులో దళారి విశ్వశాంతి కుమార్ కర్నూలుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి లేఖను ఫోర్జరీ చేసి హైదరాబాద్కు చెందిన బి.పవన్ కుమార్కు బ్రేక్ టికెట్లు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. బి.పవన్ కుమార్తో పాటు 5 మందికి దళారి రూ.10వేల డిమాండ్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఇందులో భాగంగా ముందు రూ. 5500 క్యాష్, దర్శనం తర్వాత మిగిలి డబ్బులు ఫోన్పే ద్వారా మోసం చేశారన్నారు. దీనికి సంబంధించి టీటీడీ విజిలెన్స్ వింగ్ ఫిర్యాదు మేరకు దళారి విశ్వశాంతి కుమార్ పై కేసు నమోదైంది.