అమరావతి : తిరుమలలోని శ్రీవారిని దర్శించుకోవడానికి భక్తులకు 8 గంటల సమయం పడుతుంది. సర్వదర్శనానికి 31 కంపార్టు్మెంట్ లో భక్తులు వేచివున్నారు. నిన్న స్వామివారిని 74,906 మంది భక్తులు దర్శించుకోగా 36,138 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా 4.07కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
ఇవాళ పలువురు ప్రముఖులు శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఎంఎం సుందరేశ్, ఏపీ మంత్రి జోగి రమేశ్ స్వామివారిని దర్శించుకున్నారు.