అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి కాస్త తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో
83,461 శాంపిల్స్ పరీక్షించగా 7,943 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, 98 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం 13,400 మందికి పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం రాష్ట్రంలో 153795 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు కరోనాబారిన పడి మరణించిన వారి సంఖ్య 10930కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 19,845 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ్టి వరకు రాష్ట్రంలో 1,92,56,304 శాంపిల్స్ పరీక్షించారు. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1528360కు పెరిగింది.