హైదరాబాద్ : తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ బుధవారం నగరంలో పలు కొవిడ్ దవాఖానలను సందర్శించారు. గచ్చిబౌలిలోని టిమ్స్, సికింద్రాబాద్ పరిధిలోని గాంధీ దవాఖాన, కింగ్కోఠి దవాఖానలను ఆయన పరిశీలించారు.
ఆయా దవాఖానల్లో కొవిడ్ రోగులకు చికిత్స అందించేందుకు చేస్తున్న ఏర్పాట్లు, ఔషధాలు, సిబ్బంది, మౌలిక వసతులు తదితరాలను ఆయన తనిఖీ చేశారు.
రోగులకు మెరుగైన సేవలందించేలా చూడాలని సిబ్బందికి సూచించారు. వైద్య సిబ్బంది మానవతావాదంతో సేవలు అందించాలని చెప్పారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి