గుంటూరు : గుంటూరు జిల్లాలోని అచ్చంపేట మండలంలో విషాదం నెలకొంది. మాదిపాడు వద్ద కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ఆరుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అప్రమత్తమైన స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు ముగ్గురి మృతదేహాలను బయటకు వెలికితీశారు. మరో ముగ్గురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. విద్యార్థులంతా స్థానిక వేద పాఠశాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.