అమరావతి : ఆంధ్రప్రదేశ్కు మరో 5 లక్షల కొవిడ్ టీకాలు (కోవిషీల్డ్) పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి రేపు రానున్నాయి.
శనివారం గన్నవరంలోని టీకా నిల్వ కేంద్రానికి టీకా డోసులు చేరనున్నాయి. రెండు రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ టీకాల కొరత ఏర్పడింది.
దీంతో పలు జిల్లాల్లో టీకాల పంపిణీ నిలిచిపోయింది. అవసరాలకు తగ్గట్టు జిల్లా అధికారులు స్పష్టమైన వివరాలు ఇవ్వకపోవడంతో టీకాల పంపిణీ ఆలస్యమైనట్లు సమాచారం.
టీకాలు రాగానే డిమాండ్ ఉన్న చోట పంపిణీ జరిగేలా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ వర్గాలు వివరించాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి