అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,250 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 33 మంది చనిపోయారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18,79,872కు చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 44,773గా ఉంది. ఇప్పటివరకు సంభవించిన మొత్తం మరణాలు 12,599.
జిల్లాల వారీగా తాజాగా నమోదైన కొవిడ్ మరణాల వివరాలిలా ఉన్నాయి. కృష్ణ జిల్లాలో ఎనిమిది మంది, చిత్తూరులో ఆరుగురు, తూర్పు గోదావరి, శ్రీకాకుళంలో నలుగురు చొప్పున, నెల్లూరులో ముగ్గురు, గుంటూరు, కర్నూల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరిలో ఒక్కరు చొప్పున మృత్యువాతపడ్డారు.