అమరావతి : ఏపీలోని విశాఖపట్నం నక్కపల్లి మండలం కాగిత టోల్ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలో 2వందల కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. విశాఖపట్నం నుంచి తమిళనాడుకు వ్యాన్లో గంజాయిని తరలిస్తున్న ముఠా పోలీసుల తనిఖీలను గమనించి ఇద్దరు నిందితులు వాహనం వదిలి పారిపోయారని పోలీసులు తెలిపారు .
విజయనగరం జిల్లా సాలూరులోనూ 2వందల కిలోల గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి రాజస్థాన్కు లారీలో గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు చోట్ల పట్టుకున్న గంజాయి విలువు రూ. కోటి వరకు ఉంటుందని అంచనా.