తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలోని 30 కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరికి 30 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 71, 461 మంది భక్తులు దర్శించుకోగా 26,631 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.
భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.77 కోట్లు వచ్చిందని అధికారులు వివరించారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ దంపతులు బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ధర్మారెడ్డి వారికి ఆలయ మర్యాదల ప్రకారం స్వాగతం పలికారు. అర్చకులు మంత్రి దంపతులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందజేశారు.