అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు మండలం పీ.కొత్తకోట వద్ద అదుపు తప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ముగ్గురు మరణించారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను కష్టంమీద అందులోనుంచి వెలికితీశారు. మృతులను కర్ణాటకకు చెందిన పోలీసులుగా గుర్తించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని, డివైడర్ను ఢీకొట్టిన కారు పల్టీలు కొట్టిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.