ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. గతంలో వేల సంఖ్యలో నమోదయ్యే కేసులు.. ఇప్పుడు వందల్లో నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో 253 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా, కరోనా కారణంగా చిత్తూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.
ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23,16,964 మంది కరోనా బారిన పడినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తాజా బులెటిన్లో తెలిపారు. వీరిలో 14,718 మంది మరణించారు. కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య 22,97,065 గా ఉన్నది. ఇవాల్టి వరకు రాష్ట్రంలో 3,30,30,124 నమూనాలు పరీక్షించారు. యాక్టివ్ కేసులు బాగా తగ్గుతున్నాయి. కేవలం 5,181 యాక్టివ్ కేసులున్నాయి. వీరంతా హోం క్వారంటైన్లు, ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 635 మంది కోలుకున్నారు.