అమరావతి : ఏపీలోని అంబేద్కర్-కోనసీమ జిల్లా అంకంపాలెం గ్రామంలో తేనేటీగల దాడిలో 25 మంది మహిళలు గాయపడ్డారు. వీరిలో 10 మంది అపస్మారకస్థితిలోకి చేరుకోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామానికి చెందిన మహిళలు కార్తిక మాసం ఆఖరు ఆదివారం సందర్భంగా కార్తిక వనభోజనానికి సమీపంలోని తోటలోకి వెళ్లారు.
వంటచేసిన అనంతరం మహిళలు భోజనం చేస్తుండగా ఒక్కసారిగా తేనేటీగలు దాడి చేశాయి. దీంతో మహిళలు పరుగులు తీయగా కొందరూ పరిగెత్తలేక అక్కడే ఉండిపోయారు. ఈ ఘటనలో 25 మంది మహిళలు తేనేటీగల దాడులో గాయపడగా వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటినా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.