తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 16 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి సర్వదర్శనానికి వేచియున్నారు. వీరికి 24 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ వర్గాలు వెల్లడించాయి. నిన్న స్వామివారిని 65,568 మంది భక్తులు దర్శించుకోగా 25,144 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీఆదాయం రూ. 4.26 కోట్లు వచ్చిందని తెలిపారు.
రేపు డయల్ యువర్ ఈవో
డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని శనివారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు తిరుమల అన్నమయ్య భవనంలో జరుగనుందని వివరించారు. భక్తులు తమ సందేహాలను, సూచనలను టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డికి 0877-2263261 అనే నంబర్కు ఫోన్ ద్వారా వెల్లడించవచ్చని సూచించారు.