అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1,539 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్-19తో 12 మంది చనిపోయారు. 1,140 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నారు. తాజా కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల సంఖ్య 20,07,730కి చేరుకుంది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 14,448గా ఉంది. జిల్లాల వారీగా తాజాగా నమోదైన కొవిడ్ మరణాల వివరాలిలా ఉన్నాయి. చిత్తూరు, కృష్ణలో ముగ్గురు చొప్పున, ప్రశాశంలో ఇద్దరు, తూర్పుగోదావరి, కర్నూల్, నెల్లూరు, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున మరణించారు.