తిరుపతి : జనవరి 13వ తేదీ నాటికి 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను సిద్ధం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని డీపీడబ్ల్యు స్టోర్స్లో గల పంచగవ్య ఉత్పత్తుల తయారీ కేంద్రాన్ని శుక్రవారం ఆయన పరిశీలించారు. ఇప్పటివరకు సిద్ధమైన ధూప్ కోన్స్, ధూప్ స్టిక్స్, ధూప్ పౌడర్, పంచగవ్య, హెర్బల్ అగరబత్తీలు, పిడకలు తదితర యంత్రాలను ఈవో పరిశీలించారు. పంచగవ్యాలతో అత్యంత నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేయాలని సూచించారు.
అనంతరం అలిపిరి జూపార్కు రోడ్డులో స్ప్రిచువల్ సిటీ ఏర్పాటుకు అవసరమైన భూమిని ఇంజినీరింగ్, ఎస్టేట్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవో వెంట టీటీడీ జేఈవోలు సదా భార్గవి, వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, ఎస్ఇ వెంకటేశ్వర్లు, ఎస్వీ గోశాల డైరెక్టర్ డాక్టర్ హరనాథరెడ్డి తదితరులు ఉన్నారు.