అమరావతి : ఏపీలోని అల్లూరి జిల్లా లబ్బురు జంక్షన్లో పోలీసులు గంజాయిని పట్టుకున్నారు. ద్విచక్ర వాహనాలపై గంజాయిని తరలిస్తున్న నలుగురు ఒడిశా వాసులను అరెస్టు చేశారు. మరో ఇద్దరు స్మగర్లు అక్కడి నుంచి పారిపోయారు. పట్టుకున్న వారి వద్ద నుంచి 134 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 2.60 లక్షలు ఉంటుందని వివరించారు.