విశాఖపట్నంలో భారీ ఎత్తులో శ్రీవెంకటేశ్వరస్వామి విగ్రహం ఏర్పాటు పనులు పూర్తికావచ్చాయి. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా ఇది కొత్త రికార్డు నెలకొల్పనున్నది. విశాఖలో ఆలయం నిర్మాణానికి వైకుంఠ వెంకటేశ్వరస్వామి చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. విశాఖ సాగరతీరంలో 125 అడుగుల ఎత్తులో స్వామి విగ్రహాన్ని నెలకొల్పారు.
విశాఖపట్నంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ కుంభాభిషేకానికి హాజరు కావాలని కోరుతూ మంగళవారం టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, టీటీడీ ఈవో డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించారు. శాసనసభ ఆవరణలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో వీరు జగన్ను కలసి ఈ మేరకు ఆహ్వాన పత్రిక అందించారు. టీటీడీ వేద పండితులు వేదాశీర్వాదం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో రమణ ప్రసాద్ కూడా పాల్గొన్నారు.