తిరుమల : తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 25 కంపార్టుమెంట్లలో భక్తులు స్వామివారి దర్శనానికి వేచియున్నారు. వీరికి 12 గంటల్లో దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 81,903 మంది భక్తులు దర్శించుకోగా 39,594 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా టీటీడీ హుండీకి రూ. 4.74 కోట్లు వచ్చిందని వెల్లడించారు.
రాగి గంగాళాలు బహుకరణ
హైదరాబాదుకు చెందిన గంజి రమేశ్ దంపతులు రూ.14 లక్షల విలువగల శ్రీవారి హుండీకి ఉపయోగించే 11 రాగి గంగాళాలను ఆదివారం తిరుమల వైభవోత్సవ మండపంలో ఆలయ డిప్యూటీ రమేశ్ బాబుకు అందించారు.