వచ్చే ఎన్నికల్లో కూడా వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే తమ ముందున్న టార్గెట్ అని ఏపీ తాజా మాజీ మంత్రి బొత్స సత్యానారాయణ అన్నారు. కేబినెట్లో ఎవరిని కొనసాగించాలి? ఎవర్ని సాగనంపాలి అనేది ముఖ్యమంత్రి జగన్ ఇష్టమని, ఆయనకు పూర్తి స్వేచ్ఛ ఉందని పేర్కొన్నారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసిన తర్వాత బొత్స సత్యానారాయణ విలేకరులతో మాట్లాడారు. దేవుడి దయ ఉంటే మళ్లీ 24 మంది కేబినెట్లో ఉంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతామని అన్నారు.
అయితే.. మంత్రులందరూ పూర్తి సంతోషంతోనే రాజీనామాలు చేశారని బొత్స స్పష్టం చేశారు. ఇప్పటి నుంచి సీఎం జగన్ ఏ బాధ్యతలు అప్పజెప్పినా… సమర్థవంతంగా పనిచేస్తామని అన్నారు. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ వుంటుందని సీఎం మొదట్లోనే చెప్పారని, అదే విధంగా సీఎం జగన్ ఇప్పుడు చేశారని ఆయన గుర్తు చేశారు. విశాఖ భూముల్లో తప్పంతా చంద్రబాబుదేనని బొత్స మరోసారి మండిపడ్డారు.