అమరావతి : ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక ఉత్సవాలను జరుపుకున్న ఆ రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపిన ఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. పట్టణంలోని సాయినగర్ వాసులు గణేశ్ ఉత్సవాల అనంతరం పూజాది కార్యక్రమాలను నిర్వహించి ఇవాళ నిమజ్జనం కోసం రాప్తాడు పండమేరు కాలువకు వెళ్లారు . నిమజ్జనం చేస్తుండగా నీటి ప్రవాహానికి నలుగురు నీటిలో పడిపోయారు.
వారిలో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా శ్రీరాములు, జయశ్రీ అనే బాలిక ప్రవాహంలో కొట్టుకుపోయారు. శ్రీరాములు మృతి లభ్యంకాగా గల్లంతైన అమ్మాయి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.