Vegetables on rooftop | కాంక్రీట్ జంగిల్లుగా మారుతున్న నగరాలు, పట్టణాల్లో అటు పచ్చదనానికి, ఆరోగ్యాన్ని పెంచే అద్భుత వ్యాపకంగా మిద్దె తోటలు ఉన్నాయి. తాజా కూరగాయలు పండించటంతోపాటు రసాయనాలు లేని ఆహారం సొంతంగా తయారుచేసుకొనే ఈ తరహా తోటలు పెంచుకోవటానికి పలువురు ఆసక్తి చూపుతున్నారు. 50 గజాల స్థలం ఉంటే ఒక కుటుంబానికి సరిపడా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలను పండించుకోవచ్చ. మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవాలనుకొనేవారికి కొన్ని జాగ్రత్తలు, సూచనలు..
పక్కా ఇల్లు అయి ఉండి దృఢంగా ఉండాలి. భీంపైన మట్టి తొట్లు పెడితే వాటి బరువును తట్టుకొని నిలబడేలా ఉండాలి. భవనంపై సూర్యరశ్మి పుష్కలంగా ఉండేలా చూడాలి. తోటలు పెంచుకోవటానికి మిగతా అన్ని వనరులు అందుబాటులో ఉన్నా సూర్యరశ్మి అందకపోతే పంటలు మందకొడిగా ఎదుగుతాయి. పురుగులు, తెగుళ్లు ఎక్కువగా ఆశిస్తాయి. ఎక్కువకాలం శాఖీయ దశలోనే ఉండిపోతాయి. ముఖ్యంగా పండ్లతోటలు, పండ్లు, కాయలనిచ్చే కూరగాయల పెంపకానికి సూర్యరశ్మి పుష్కలంగా అందాలి. కుండీలు, తోట్లు, మట్టితోకూడిన నిర్మాణాల నుంచి వచ్చే మురుగునీరు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లేందుకు అనువుగా ఉండాలి. ప్రధాన రహదారులు, ఫ్యాక్టరీలకు దగ్గరగా ఉన్న గృహాలపై దుమ్ము ఎక్కువగా పడుతుంది. దాంతో కిరణజన్యసంయోగ క్రియ తక్కువగా జరిగి మొక్కల పెరుగుదల తక్కువగా ఉంటుంది. అందువల్ల ఇలాంటి గృహాలపై తోటలను పెంచకపోవటం మేలు.
ఇలా చేస్తే..