Sugarcane cultivation | చెరకు పైరు ఎదుగుదలకు ఉష్ణోగ్రతలు ప్రతిబంధకాలు. అధిక, తక్కువ ఉష్ణోగ్రతల్ని చెరకు పైరు తట్టుకోలేదు. లేత తోటలు ఇలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల్ని తట్టుకొని నిలబడడం చాలా కష్టం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో వేసిన చెరకు తోటలు ప్రస్తుతం పిలకలు తొడిగి, పెరిగే దశలో ఉన్నాయి. జూన్ వరకూ ఉష్ణోగ్రతలు అత్యధిక స్థాయిలో ఉంటాయి. గాలిలో తేమ బాగా తక్కువగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బిందుసేద్య పద్ధతి ద్వారా భూమిలో తేమను కాపాడుకుంటూ చెరకు పైరును రక్షించుకోవడం ఎలాగో తెలుసుకుందాం.
బిందుసేద్యం ద్వారా అనేక ప్రయోజనాలు పొందవచ్చు. సాధారణంగా ఎకరం విస్తీర్ణంలో చెరకు తోటకు అందించే నీటితో బిందుసేద్య పద్ధతిలో మూడు, నాలుగు ఎకరాల్లో సాగు చేయొచ్చు. వేసవిలో విద్యుత్ కోతలు సర్వసామాన్యమే అయినప్పటికీ బిందుసేద్య పద్ధతిలో చెరకు పంట సాగు చేస్తే ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు కరెంటు వచ్చినా అప్పుడు ఆటోమేటిక్ పరికరం సాయంతో ఏ ఇబ్బందీ లేకుండా తోటకు నీరు అందించే వీలుంటుంది. పైగా నీరు పెట్టేందుకు ప్రత్యేకంగా మనిషి అవసరం ఉండదు. బిందుసేద్య పద్ధతిలో పాములు, విషపురుగుల బారిన పడే ప్రమాదం ఉండదు.
ప్రయోజనాలు
ప్రోత్సాహం-దిగుబడులు
చెరకు సాగులో బిందుసేద్యాన్ని ప్రోత్సహించేందుకు పలు చక్కెర కర్మాగారాలు రైతులకు సబ్సిడీలు అందిస్తున్నాయి. దీని కారణంగా బిందుసేద్యంపై రైతుల్లో ఆసక్తి పెరుగుతున్నది. ఇప్పటికే చాలా మంది రైతులు బిందుసేద్య పద్ధతిలో చెరకు సాగు చేసి మంచి ఫలితాలు పొందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం గ్రామంలో ఎకరానికి సగటున 70 టన్నులు, పిలక తోటలో 69.4 టన్నుల దిగుబడి సాధించారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లికి చెందిన రైతు ఒకరు ఎకరానికి సగటున 70 టన్నుల దిగుబడి పొందారు.
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి