ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 21: ఆదిలాబాద్ పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామ ని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని కైలాస్నగర్లో రూ.50లక్షలతో నిర్మించిన వైకుంఠధామం, ఓపెన్జిమ్, రూ.55లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 38వ వార్డు అభివృద్ధి కోసం ఇప్పటి వరకు సుమారు రూ.4.11కోట్లు వెచ్చించినట్లు చెప్పా రు. బీటీ, సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు. కూడళ్లను సుందరంగా తయారు చేస్తున్నామని వెల్లడించారు. మరి కొన్ని నెలల్లో పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్ వచ్చిన తర్వాత ఆదిలాబాద్ జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించి, నిధులు మంజూరు చేస్తున్నారని వెల్లడించారు. అనంతరం 14మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశా రు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శైల జ, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, పట్టణాధ్యక్షుడు అజ య్, కౌన్సిలర్ అర్చన, రాంకుమార్, గంగారెడ్డి, యూనుస్ అక్బానీ, శివకుమార్ పాల్గొన్నారు.
ఆదివాసీ పర్ధాన్ సమాజ్ అభివృద్ధికి కృషి
ఆదివాసీ పర్ధాన్ సమాజ్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనథ్ మండల కేంద్రంలో పర్ధాన్ సమాజ్ కమ్యూనిటీ హాల్, హీరాసుఖ విగ్రహ నిర్మాణానికి సంఘం నాయకులతో కలిసి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ పర్ధాన్ సమాజ్ మహిళలు ఎమ్మెల్యేకు నుదుట తిలకం దిద్ది సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నిబంధనల మేరకు భూమిలేని వారికి భూమికొనుగోలు చేసి ఇస్తామని చెప్పారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, యువతకు ఉపాధితో పాటు శిక్షణ ద్వారా నైపుణ్యాలు పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ఎస్ లింగారెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తం యాదవ్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ తల్లెల చంద్రయ్య, సర్పంచ్ దేవన్న, పర్ధాన్ సంఘం డివిజన్ అధ్యక్షుడు గోడం గంగారాం, మండల గౌరవాధ్యక్షుడు మ్సైం రాంచందర్, మండల అధ్యక్షుడు కోవ ప్రభాకర్, నాయకులు గేడం విష్ణు, రఘురాం, కోవ నారాయణ, శోభన్ పాల్గొన్నారు.