కడెం, డిసెంబర్ 30: యాసంగిలో ఆరుతడి పంటల కోసం జనవరి 10 నుంచి కడెం కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయనున్నట్లు ఆయకట్టు ఈఈ రాజశేఖర్ తెలిపారు. మండలకేంద్రంలోని రైతువేదికలో ఖానాపూర్, మంచిర్యాల ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖానాయక్, నడిపెల్లి దివాకర్రావు సమక్షం లో కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి మండలాల పరిధిలోని రైతులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ కుడి కాలువ ద్వారా కొండుకూర్, బెల్లాల్ గ్రామాలకు నీరు అందించాల్సి ఉండగా, కాలువకు మూడుచో ట్ల గండ్లు పడి నీరు వృథాగా పోతున్నదని, స ర్కారు కాలువల పునరుద్ధరణకు నిధులు మం జూరు చేసినప్పటికీ ఆయకట్టు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అలాగే కుడి కాలువ ద్వారా కడెం మండలంలోని అంబారిపేట లైనింగ్ వద్ద సమస్యలు, దస్తురాబాద్ మండలంలోని మున్యాల్ వద్ద, జన్నారం మండలంలోని డిస్ట్రిబ్యూటర్ 13 వద్ద, దండేపల్లి మండలంలోని పలుచోట్ల కా లువ సమస్యలున్నాయని రైతులు వాపోయా రు.
ఈ విషయమై యేటా సమావేశం నిర్వహించి చర్చించినప్పటికీ పరిష్కారం కావడం లేదన్నారు. మరమ్మతుల అనంతరమే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మె ల్యే అజ్మీరా రేఖానాయక్ మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించి నీటిని విడుదల చేయాలని, లేకుంటే రైతులతో కలిసి నీటి పారుదలశాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఆయకట్టు ఈ ఈ రాజశేఖర్ మాట్లాడుతూ…కాలువల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే కడెం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7. 603టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 698.725 అడుగులు (7.271టీఎంసీల) వద్ద ఉందని, డెడ్స్టోరేజ్ 675 అడుగులు (2.781టీఎంసీలు) అని తెలిపారు. యాసంగిలో కడెం కుడి కాలువకు డిస్ట్రిబ్యూటరీ-1 నుంచి డిస్ట్రిబ్యూటరీ-28 వరకు అంటే కడెం నుంచి దస్తురాబాద్, జన్నా రం, దండేపల్లి మండలాల వరకు నీటిని అందిస్తామని చెప్పారు. జనవరి 10న రెండు కాలువలకు నీటిని విడుదల చేస్తామని, కుడి కాలువ రెగ్యులర్గా కొనసాగుతుందని, ప్రధాన కాలువకు మాత్రం వారబంధీ పద్ధతిన నీటిని విడుదల చేస్తామని తెలిపారు.
మొత్తం ఆరు తడులకు నీటిని విడుదల చేసేందుకు తీర్మానించినట్లు పేర్కొన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని మంచిర్యాల ఎమ్మె ల్యే నడిపెల్లి దివాకర్రావు సూచించారు. కార్యక్రమం లో ఖానాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పు ప్పాల శంకర్, కడెం సర్పంచ్ కొండపురం అనూష, కడెం, జడ్పీటీసీ పురపాటి శ్రీనివాస్రెడ్డి, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నల్ల జీవన్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు జొన్నల చంద్రశేఖర్, మల్లారెడ్డి, సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు గోళ్ల వేణు, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి మం డలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు.