మంచిర్యాలటౌన్, డిసెంబర్ 18: మంచిర్యాల పట్టణ వాసులకు స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేసేందుకు మున్సిపల్ పాలక, అధికార వర్గాలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. 12 ఏళ్ల క్రితం ముల్కల పంప్హౌస్ వద్ద నిర్మించిన వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటును రూ. 80 లక్షల జనరల్ ఫండ్ నిధులు వెచ్చించి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపడుతున్నారు. మున్సిపల్ ఇంజినీర్ మధూకర్, ఏఈ రాజేందర్ పర్యవేక్షణలో ఈ పనులు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం మంచిర్యాల పట్టణ వాసుల తాగునీటి అవసరాల కోసం గోదావరి నదిలో ఉన్న ఇన్ఫిల్టరేషన్ వెల్లను ఉపయోగిస్తున్నారు.
దీంతోపాటు కొన్ని ప్రాంతాలకు మిషన్ భగీరథ ప్రాజెక్టు నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. అయితే ఇపుడున్న ఇన్ఫిల్టరేషన్ వెల్లు వేసవిలో పూర్తిగా ఎండిపోయి నీటి లభ్యత లేకుండా పోయే అవకాశాలు ఉన్నాయి. దీంతో అధికారులు రానున్న వేసవిలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నీటిని పంపహౌస్ వద్దకు తరలించి శుద్ధి అనంతరం వార్డులకు సరఫరా చే స్తారు. అయితే ఇప్పటివరకు గోదావరి నదిలోని ఇన్ఫిల్టరేషన్ బా వులలో నీటి కొరత ఏర్పడలేదు. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్వహణ సరిగా లేక, తరచూ ఫిర్యాదులు అందేవి. ఈ సమస్యకు చె క్ పెట్టేందుకే కౌన్సిల్ ఖర్చును భరించేందుకు ఆమోదం తెలిపిం ది. ఈ మేరకు పనులు మొదలయ్యాయి.
వాటర్ ట్రీట్మెంట్ ప్లాంటును పూర్తిగా కొత్తగా మారుస్తున్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టునుంచి వచ్చే రా వాటర్ను శుద్ధి చేసేందుకు ని ర్మించిన క్లారీ ఫాకులేటర్ను పూర్తిగా ఖాళీచేసి అందులోని చెత్తను తొలగించారు. క్లారీ ఫాకులేటర్ మొత్తానికి నీలిరంగు వేశారు. ఆరు కంపార్ట్మెంట్లలో నిర్మించిన ఫిల్టర్బెడ్లో ఇప్పటికే ఉన్న ఇసుక, గులకరాళ్లు తొలగించారు. వాటి స్థానంలో కొత్తగా సముద్రపు ఇసుక, గులకరాళ్లు నింపుతారు. పాత పైపులైన్లను తొలగిం చి కొత్తవి ఏర్పాటుచేస్తారు. ఎయిర్పైప్లు, ఎయిర్ బ్లోయర్లు కొ త్తవి ఏర్పాటు చేస్తున్నారు. సముద్రపు ఇసుకను ఏపీలోని చీరా ల నుంచి తీసుకొస్తున్నారు.
కర్నూలు సమీపంలో దొరికే ప్రత్యేకమైన గులకు రాళ్లను ఉపయోగిస్తున్నారు. నీటిని శుద్ధి చేశాక, అక్కడి నుంచి నీరు ప్రత్యేక కాలువ ద్వారా ఫిల్టర్ బెడ్లోకి పంపిస్తా రు. అక్కడి నుంచి కాలువ ద్వారా పక్కనే ఉన్న సంప్లోకి వచ్చి చేరుతాయి. సంప్లో నీటిని మోటర్లద్వారా పట్టణంలోని వాటర్ ట్యాంకుల్లోకి తరలిస్తారు. అనంతరం వార్డుల్లోకి సరఫరా చే స్తారు. రోజుకి 17.5 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేసే సామర్థ్యాన్ని ఈ ప్లాంటు కలిగిఉంది.
మంచిర్యాలలో ప్రస్తుతం 12వేల పైచిలుకు నల్లా కనెక్షన్లు ఉ న్నాయి. 36 వార్డుల్లో విస్తరించి ఉన్న పట్టణంలో రోజుకు 14.85 ఎంఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నారు. ఇందులో 9.85 ఎంఎల్డీ నీటిని ముల్కల పంప్హౌస్ ద్వారా ఇస్తుండగా 5 ఎం ఎల్డీ నీటిని మిషన్ భగీరథ నుంచి అందిస్తున్నారు. డీఎఫ్వో ఆఫీస్ వాటర్ట్యాంకు, ఐబీ, కాలేజ్రోడ్, హమాలీవాడ, హైటెక్కాలనీ, రాజీవ్నగర్, పాతమంచిర్యాల ట్యాంకుల ద్వారా పట్టణంలోని వార్డులకు తాగనీరు సరఫరా అవుతోంది. మిషన్ భగీరథ పథకం కింద పట్టణంలో అండాళమ్మకాలనీ, తోళ్లవాగు, దొరగారిపల్లి ప్రాంతాల్లో మరో మూడు రిజర్వాయర్లను నిర్మిస్తున్నారు.
పట్టణంలో తాగునీటికి ఇబ్బందుల్లేకుం డా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ముల్కల పంప్ హౌస్ వద్ద ట్రీట్మెంట్ ప్లాంటులో రూ. 80 లక్షలతో మరమ్మ తులు చేపడుతున్నాం. ప్రస్తుతం ఇన్ఫి ల్టరే షన్ బావులలో నీరు సమృద్ధిగా ఉంది. కానీ ఎండాకాలంలో నీటి ఊట ఉండదు. అప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటిని తీసుకోవాల్సి ఉంటుంది. చాలా రోజులుగా నీరు నిలిచి ఉండడంతో శుద్ధి చేసి పంపించాలి. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
– పెంట రాజయ్య, మున్సిపల్చైర్మన్, మంచిర్యాల