ఎదులాపురం, మార్చి 18 : కంటైనర్ ను దొంగతం చేసి, డ్రైవర్ను కత్తులతో గాయపర్చిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా ను జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్లో జిల్లా ఎస్పీ డీఉదయ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సంద ర్భంగా వివరాలు వెల్లడించారు. మహా రాష్ట్ర నాగ్పూర్ జిల్లా నుంచి హల్దిరామ్ లోడ్ కంటైనర్ లో నింపుకొని హైదరాబాద్కు ఈ నెల 13న అక్కడి నుంచి బయలు దేరారు.
14న ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ శివారులోని దేవుల నాయక్ తండా బస్టాం డ్ వద్ద కంటైనర్ను కొంత మంది కారుతో అడ్డుకు న్నారు. కంటైనర్ డ్రైవర్కు తుపాకులు గురిపెట్టి బెదిరించి కత్తులతో పొడిచారు. కంటైనర్లో ఉన్న 360 హల్దిరామ్ బాక్స్ లోడ్ను నేరడిగొండలో కిరాయికి తీసుకున్న షటర్లో ఖాళీ చేశారు. తర్వాత నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం శ్రీరాంపూర్ గ్రామం వద్ద కంటైనర్, డ్రైవర్ను వదిలి వెళ్లిపోయారు. ఈ క్రమంలో కంటైనర్ డ్రైవర్ మహారాష్ట్ర యావత్మల్ జిల్లాకు చెందిన దుమక్ చచొర గ్రామానికి చెందిన ప్రపుల్ ఆనంద్ రావు ధబేకర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఈ మేరకు ఉట్నూర్ డీఎస్పీ, ఇచ్చోడ, సీసీఎస్ సీఐ, ఎస్ఐతో టీమ్ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజస్ధాన్ నుంచి మహ్మద్ అర్షద్ రెండు సంవత్సరాల క్రితం తన బంధువు ఎండీ సజీత్ ఖాన్ పరిచయమై నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం స్వర్ణ గ్రామానికి మసీద్ ఇమామ్గా వచ్చాడు. స్వర్ణ గ్రామంలోని ముస్లిం పిల్లలకు అరబి నేర్పిస్తుంటాడు. ఇదే క్రమంలో ఏదైనా దోపిడి, దొంగతనలు చేయాలని నిర్ణయిం చుకున్నాడు. అర్షద్ వెంట నాటు తుపాకు లు, 14 తుటాల తీసుకొచ్చాడు. అర్షద్ తమ్ముడు నాసిమ్, ఉత్తర్ప్రదేశ్ మధురా జిల్లాకు చెందిన జాకీర్ ఖాన్, ముజాహిద్ ఖాన్, ముస్తాక్ఖాన్, రాజస్థాన్కు చెందిన జాఫార్ ఖాన్, నిజామాబాద్ జిల్లాకు చెందిన మహ్మద్ సాజీద్ ఖాన్ దోపిడి చేయడానికి ప్లాన్ వేశారు.
మహ్మద్ అర్షద్ సూచన మేరకు నాటు తుపాకులు, ఐరన్ రాడ్, కత్తులు తీసుకొని ఈ నెల 13వ తేదీన తెల్లవారు జామునా సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ప్రాంతంలో ఫ్లిప్ కార్డ్ పార్సిల్ తో వెళ్తున్న వాహనాన్ని ఆపి అందులో నుంచి రూ.1.78 లక్షల విలువైన ఫ్లిప్ కార్ట్ పార్సిల్ దోపిడీ చేశారు. అదే రోజు రాత్రి ఆదిలాబాద్కు బయలు దేరారు. ఇచ్చోడ శివారులోని దేవుల నాయక్ తండా బస్టాండ్ వద్ద కంటైనర్ను ఆపి అందులో ఉన్న 360 హల్దీరామ్ బాక్స్లు దొంగి లించారు. కంటైనర్ డ్రైవర్ను కత్తులతో గాయపరి చారు. శనివారం ఉదయం ఇచ్చోడ వద్ద అంత ర్రాష్ట్ర ఏడుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5.53లక్షల హల్దీరామ్ 360 బాక్స్లు, 2 తపంచ తుపాకులు, 14 బుల్లెట్లు, 2 కత్తులు, 2 ఇనుపరాడ్లు, రెండు కార్లు, 9 మొబైల్ ఫోన్లు, 1 బైక్, ఫ్లిప్ కార్డ్లో కొట్టిసిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. త్వరలోనే కేసు ఛేదించిన పోలీసులకు రివార్డు అందజేశామన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ సీహెచ్ నాగేందర్, సీఐలు ఎం నైలు, చంద్రమౌళి, ఎస్ఐలు సాయన్న, ప్రవీణ్ ఉన్నారు.