బెల్లంపల్లిరూరల్, మార్చి31 : సాంఘిక సంక్షేమ గురుకులాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలలో వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్లో ప్రవేశాల కోసం రెండు దశల్లో నిర్వహించిన పరీక్షల్లో బెల్లంపల్లి తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాల (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ) విద్యార్థులు సత్తా చాటారు. సీవోఈ మొదటి దశ ప్రవేశ పరీక్షకు హాజరైన 74 మందిలో 53 మంది రెండో దశ పరీక్షకు అర్హత సాధించారు. ఇందులో 14 మంది విద్యార్థులు ప్రీమియర్ సీఈవోలలో సీట్లు సాధించారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సీవోఈలలో ప్రవేశాల కోసం వచ్చే రెండో దశ ఫలితాల్లో మరో 15 సీట్లు సాధించి తీరుతామని ప్రిన్సిపాల్ ఐనాల సైదులు తెలిపారు.
విద్యార్థులు అల్తాటి వినయ్ (బైపీసీ-గౌలిదొడ్డి), మెరుగు అజయ్కుమార్ (బైపీసీ-గౌలిదొడ్డి), దాగం సాయిసిద్ధార్థ (బైపీసీ-గౌలిదొడ్డి),గుమ్మడి ఉజ్వల్ (బైపీసీ-గౌలిదొడ్డి),దుగుట సౌమిత్ (బైపీసీ-గౌలిదొడ్డి), దుర్గం నవీన్ (బైపీసీ-గౌలిదొడ్డి), గోమాస అభిషేక్ (బైపీసీ-గౌలిదొడ్డి), బొల్లం అభినవ్తేజ్ (బైపీసీ-గౌలిదొడ్డి), జాడి ప్రపుల్ (బైపీసీ-అల్గునూరు), గొల్లమాడ చక్రధర్(బైపీసీ-అల్గునూరు),చిలుముల రాకేశ్ (ఎంపీసీ-అల్గునూరు), దుర్గం కార్తీక్(ఎంపీసీ-అల్గునూరు), సూర్యవంశీ కిరణ్కుమార్ (ఎంపీసీ-చిల్కూర్), బక్కం సాయివిఘ్నేష్ (ఎంఈసీ-ఇబ్రహీంపట్నం) కళాశాలల్లో సీట్లను దక్కించుకున్నారు. సీట్లు సాధించిన బెల్లంపల్లి సీవోఈ విద్యార్థులను ఆర్సీవో కే.స్వరూపారాణితో పాటు కళాశాల అధ్యాపకులు, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.