ఆదిలాబాద్ టౌన్, మార్చి 30 : శ్రీరామనవమి సందర్భంగా జిల్లాలోని ఆలయాల్లో గురువారం సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. దీంతో సమీప ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్బోర్డు కాలనీలోని రామాలయంలో కల్యాణ మహోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన కలెక్టర్ దంపతులకు ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. వారికి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు.
జైనథ్, మార్చి 30: భోరజ్, పిప్పర్వాడ, ఆనంద్పూర్, దీపాయిగూడ, నిరాల మంగూర్ల సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఎమ్మెల్యే జోగు రామన్న, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, ఎంపీపీ గోవర్ధన్, పీఏసీఎస్ చైర్మన్ పురుషోత్తంయాదవ్, సర్పంచ్లు సంతోష్ రెడ్డి, ఎంపీటీసీ మహేందర్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు
బోథ్, మార్చి 30: సొనాల గ్రామ రామాలయంలో సీతారాముల కల్యాణాన్ని వీక్షించడానికి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ హాజరయ్యారు. కల్యాణం అనంతరం రామాలయంలో పెద్దఎత్తున అన్నదానం నిర్వహించారు. కార్యక్రమంలో చైర్మన్ జీవీ రమణ, సర్పంచ్ సదానందం, జడ్పీటీసీ సంధ్యారాణి, అధ్యాపకులు జాదవ్ బలిరాం పాల్గొన్నారు.
ఇచ్చోడ, మార్చి 30 : ఇచ్చోడ మండలం బోరిగామలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, పట్వారిగూడలోని శ్రీ రామ మందిరంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. బోరిగామ గ్రామానికి చెందిన తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ గోపిడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు స్వామి వారికి పట్టు వస్ర్తాలు, తలంబ్రాలు సమర్పించారు. సిరిచెల్మ గ్రామంలో భక్తులు ర్యాలీ తీశారు. కార్యక్రమంలో సర్పంచ్ అరుంధతి సురేందర్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.
భీంపూర్, మార్చి 30 : అంతర్గాంలోని రామాలయం, తాంసి మండలం హస్నాపూర్ రామాలయంలో మాజీ ఎంపీ నగేశ్ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీలు తాటిపెల్లి రాజు, కుమ్ర సుధాకర్, సర్పంచ్ బక్కి లలిత, ఉప సర్పంచ్ ముకుంద్, నాయకులు కపిల్ యాదవ్, బక్కన్న, మంగళ, కుడిమెత సంతోష్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్/ఇంద్రవెల్లి/;నేరడిగొండ/భీంపూర్/ తలమడుగు, మార్చి 30: గుడిహత్నూర్లోని శివాలయంలో, మన్నూర్, ఉమ్రి గ్రామాల్లోని రాంమందిరంలో సీతారాముల కల్యాణానికి భక్తులు తరలివచ్చారు. ఇంద్రవెల్లిలోని బజార్గల్లీ హనుమాన్ ఆలయ ఆవరణలో భక్తులు సీతారాముల విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేశారు. రథంపై రాముని చిత్రపటం ఏర్పాటు చేసి శోభాయాత్ర నిర్వహించారు. నేరడిగొండ మండలం తేజాపూర్లో శ్రీరాముని చిత్రపటంతో శోభాయాత్ర వైభవంగా నిర్వహించారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతూ ముందు నడిచారు. భీంపూర్ మండలం కరంజి(టీ) నిర్వహించిన శ్రీరామ నవమి ఉత్సవాలకు సమీప మహారాష్ట్ర నాగాపురం మహిళా భజన మండలి వారు వచ్చారు. ఉత్సవాల్లో వేద పండితులు బ్రహ్మశ్రీ పనకంటి కిరణ్ శర్మ, మహేశ్ భారతి, అతుల్ శర్మ, సర్పంచ్లు, భక్తులు పాల్గొన్నారు. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలోని రామాలయంలో భక్తులు ప్రత్యేక క్యూలో నిలబడి పూజలు నిర్వహించారు.
బజార్హత్నూర్. మార్చి 30: మండల కేంద్రంలో బజరంగ్దళ్, విశ్వహిందూపరిషత్, హనుమాన్ దీక్షాపరులు శ్రీరాముని పల్లకీ శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు గాండ్ల రమేశ్, తడక శ్రీనివాస్, నర్సయ్య, సాయి, సంతోష్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఉట్నూర్, మార్చి 30 : మండల కేంద్రంలోని శ్రీ శివరామ గురుదత్త సాయికృష్ణ ఆలయంలో సీతారాముల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు డివిజన్ నుంచే కాకుండా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లాలోని సమీప గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఎమ్మెల్యే రేఖానాయక్ పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, యువత, వివిధ పార్టీల నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, మార్చి 30 : మండల కేంద్రంలోని సీతారామ కల్యాణ మహోత్సవంలో బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్ ప్రత్యేక పూజలు చేశారు.