సీసీసీ నస్పూర్, జనవరి 13 : సింగరేణి కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం పెద్దపీట వేస్తుందని చైర్మన్ అండ్ మేనేజిం గ్ డైరెక్టర్ బలరాం పేర్కొన్నారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి శ్రీరాంపూర్ ఏరియాలో ఆయన పర్యటించారు. శనివారం సాయంత్రం నస్పూర్ కాలనీలోని సింగరేణి డిస్పెన్సరీలో రూ.33 లక్షలతో ఏర్పాటు చేసిన నూత న డిజిటల్ ఎక్స్రే సెంటర్ను ప్రారంభించారు.
ఈ సందర్భం గా సీఎండీని ఏరియా జీఎం సంజీవరెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖదీర్, గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు వీరభద్రయ్య, ముస్కె సమ్మయ్య, ఏరియా ఉపాధ్యక్షుడు కొట్టె కిషన్రావు, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ప్రసాద్, ఉపాధ్యక్షులు శంకర్రావు, కుమారస్వామి, నాయకులు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, టీబీజీకేఎస్ బ్రాంచ్ కార్యదర్శి పానగంటి సత్తయ్య, మాజీ ఏరియా చర్చల ప్రతినిధి పెట్టం లక్షణ్ శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి, రక్షణ, ఓబీ, డిస్పాచ్, సంక్షేమం కోసం ఎలాంటి చర్యలకైనా వెనుకాడబోదని చెప్పారు. సంస్థ నిర్దేశిత లక్ష్యాల సాధనకు ఉద్యోగులంతా సమష్టిగా కృషి చేయాలన్నారు. రూ. 16 కోట్లు వెచ్చించి శ్రీరాంపూర్, నస్పూర్కాలనీలకు తాగు నీరు సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. సింగరేణి సంస్థ 8 రాష్ర్టాల విద్యుత్ పరిశ్రమలకు బొగ్గు సరఫరా చేస్తుందన్నారు. తనకు సీఎండీగా బాధ్యతలు అప్పగించిన తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగరేణి జీఎం పర్సనల్ హన్మంతరావు, ఎస్వోటూ జీఎం రఘుకుమార్, డీవైపీఎం కాంతారావు, డీవైసీఎంవో డాక్టర్ రమేశ్బాబు, హెల్త్ ఆఫీసర్ లోక్నాథ్రెడ్డి పాల్గొన్నారు.