ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)లో ఉన్నతస్థాయి ఉద్యోగం.. లక్షల్లో వేతనం.. మంచి జీవనం.. అయినా ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదు. చిన్నప్పుడు తండ్రి చెప్పిన మాటలు.. ఆయన చదువుకునే సమయంలో వరంగల్ కలెక్టర్గా పని చేసిన శాలిని మిశ్రాను చూసి ఇన్స్పైర్ అయ్యాడు. ఆమెను జనం పొగుడుతుంటే నేను కూడా అలా కావాలని కలలు కన్నాడు. నాలుగు గోడల మధ్య ఉండడం కాదు.. నలుగురికి సేవ చేయాలనే తపన ఆరంభమైంది. అదే ఆయనను సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేయించింది. సివిల్ సర్వీస్ సాధించి మంచిర్యాల డీఎఫ్వోగా శివ్ ఆశిష్ సింగ్ విధులు నిర్వహిస్తున్నాడు. వచ్చిన ఐదు నెలల్లోనే తన మార్క్ చూపిస్తున్నాడు. సోలార్ పవర్తో లైవ్ స్ట్రీమింగ్ కెమెరాలు, 30 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్, సఫారీలు, సఫారీ ట్రాక్లు ఏర్పాటు చేయించాడు. మంచిర్యాల డీఎఫ్వోతో ‘నమస్తే’ ప్రత్యేక ఇంటర్వ్యూ..
మంచిర్యాల, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీటెక్ చదువు పూర్తి కాగానే ఇండియన్ స్పే స్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)లో సైంటిస్ట్ ఉద్యో గం.. లక్షల్లో జీతం. కానీ.. అది ఆయనకు సంతృప్తిని ఇవ్వలేదు. తన నాన్న వరంగల్ జిల్లాలోని ఇంటర్మీడియెట్ జిల్లాస్థాయి అధికారిగా పని చేశారు. ఆ టైంలో కలెక్టర్, రాష్ట్ర కమిషనర్స్ రివ్యూ లు నిర్వహించేవారు. ‘వాళ్లు చెప్పింది మేం చేయా లి. నలుగురికి మంచి జరిగే నిర్ణయాలు తీసుకునేది వాళ్లే’ అని నాన్న అనేవారు. అప్పుడు ఆయన మదిలో మెదిలింది. పెద్దయ్యాక సివిల్స్ సర్వీస్ కొ ట్టాలని. పదో తరగతి వరకు గ్యాబ్రియల్స్ స్కూ ల్లో చదుకొని.. హైదరాబాద్లో ఇంటర్ పూర్తి చేశాడు. 2011లో రూర్కీ ఐఐటీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ పూర్తి చేయగానే.. ఇస్రోలో సైంటిస్ట్గా ఉద్యో గం వచ్చింది. ‘మంచి జీతం.. సెట్ అయిపోయావ్ రా’ అని ఇంట్లో వాళ్లు, స్నేహితులు అన్నా.. తన మనసులో మాత్రం సివిల్ సర్వీసెస్ కొట్టాలనేది ఆయన కల. బెంగళూరులో ఇస్రో సైంటిస్ట్ ఉద్యో గం వదులుకొని ప్రిపరేషన్ మొదలు పెట్టాడు. మధ్యలో ఎస్బీఐ మేనేజర్, ఎక్సైజ్ సర్వీస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లలో పని చేశాడు. 2017లో సివిల్స్ రాసి సెలెక్ట్ అయ్యాడు. పోస్టింగ్ కోసం ఎదురు చూ స్తూ హైదరాబాద్ ఆర్బీఐలో మేనేజర్గా సేవలు అందించాడు. చివరకు తన సొంత జిల్లా వరంగల్ పొరుగున ఉన్న ములుగు జిల్లా తాడ్వాయిలో డీఎఫ్వోగా పోస్టింగ్ వచ్చింది. ఆయనే మంచిర్యాల జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిష్ సింగ్. బాధ్యతలు చేపట్టిన ఐదు నెలల్లోనే తన మార్క్తో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. శివ్ ఆశిష్ సింగ్తో ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక ఇంటర్వ్యూ.
శివ్ ఆశిష్ సింగ్ది హన్మకొండ. రవి ఠాకూర్-మాలతి ఠాకూర్ తల్లిదండ్రులు. ఒక అక్క. రవి ఠాకూ ర్ ఇంటర్మీడియెట్ జిల్లా అధికారిగా ఉన్న సమయంలో అక్కడ కలెక్టర్గా శాలిని మిశ్రా ఉన్నారు. వరంగల్ రూపురేఖలను మార్చింది ఎవరంటే.. ఇప్పటికీ శాలిని మేడం పేరే చెబుతారు. చిన్నప్పుడు ఆమెను చూసి ఇన్స్పైర్ అయ్యాడు. ఐఐటీలో తన బ్యాచ్మెంట్స్ కూడా ఇద్దరు సివిల్స్ సాధించారు. వాళ్లు చేసే పనులు చూసి ఆశ్చర్యపోయాడు. సమాజంలో ఒక పాజిటివ్ చేంజ్ అనేది సివిల్ సర్వెంట్స్తోనే సాధ్యమవుతుందని నమ్మాడు. ఐపీఎస్, ఐఏఎస్లు ఏం చేస్తున్నారు.
ఎంత వరకు ఇన్పాక్ట్ చేస్తున్నారో చూసి, మనం కూడా ఇలా చేయాలి అనుకునే వారు. ఇస్రోలో ఉన్నప్పుడు చంద్రయాన్, మంగళ్యాన్ లాంటి భారీ ప్రాజెక్ట్లపై పని చేశారు. కానీ.. దాని ప్రయోజనం పరోక్షంగా ఉం టుంది. ఆయన చేసేది ఎవరికీ తెలియదని భావించాడు. ప్రజలకు ఏదో చేయాలనే తపనతో నాలుగు గోడల మధ్య ఉండడం కన్నా.. నలుగురికి ఉపయోగపడేలా ఉండాలనుకొని సివిల్స్ సాధించాడు. ఇవాళ చేస్తున్న పనిలో చాలా తృప్తి పడుతున్నాడు. పులుల సంరక్షణతో నా జీవితం ముడిపడి ఉం దేమో.. అని నవ్వుతూ.. తెలిపాడు.
మంచిర్యాల అడవులు పులులకు ఆవాసంగా మారుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట వాటి కదలికలు ఉంటున్నాయి. దీంతో పులుల సంరక్షణకు మంచిర్యాల జిల్లా అటవీ శాఖలో అధునాతన సాంకేతికతను పరిచయం చేశాడు. పెద్ద పెద్ద టైగర్ రిజర్వ్లో మాత్రమే ఉండే సోలార్ సీసీ కెమెరాలను మంచిర్యాల అడవుల్లో పులుల ఎంట్రీ పాయింట్స్లో ఏర్పాటు చేయించాడు. చెన్నూరు, బెల్లంపల్లిలో ఇలాంటివి 25కుపైగా సోలార్ సీసీ కెమెరాలు ఉన్నాయి. పూర్తిగా సోలార్ పవర్తో నడిచే ఈ కెమెరాలు 24/7 లైవ్ స్ట్రీమింగ్ చేస్తుంటాయి. అంటే అధికారి మంచిర్యాల జిల్లా కేంద్రంలో కూర్చొని సెల్ఫోన్లో అక్కడ తిరుగుతున్న పులి, ఇతర వన్యప్రాణులను చూస్తుంటారు. వన్యప్రాణులను వేటాడేందుకని వెళ్లే వారిని ఈ కెమెరాలు ఇట్టే పట్టేస్తాయి. వీటిలో 64 జీబీ మెమోరీ కార్డు ఉంటుంది.
మనకు కావాలనుకుంటే రెండు, మూడు రోజుల కిందటి పుటేజీలను కూడా పరిశీలించవచ్చు. ఇది రాష్ట్రంలో ఎక్కడా లేని విధానం కావడం గమనార్హం. అడవిలో పులులకు ఏడాది పొడవునా ఆహారం దొరికేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే జిల్లాలో జన్నారంలో 600 హె క్టార్లు, బెల్లంపల్లిలో 100, చెన్నూరులో 100, మంచిర్యాలలో 150 హెక్టార్లలో గడ్డి మైదానాలు బాగు చేయగా, ఈ ఏడాది చివరి నాటికి మరో 300 హెక్టార్ల నుంచి 400 హెక్టార్ల వరకు గడ్డి మైదానాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటికి తోడు పులులకు ఎప్పటికీ తాగునీరు దొరికేలా నీటి కుంటలు, చెక్ డ్యామ్లు ఏర్పాటు చేశారు. పులు లు సంచరించే ప్రాంతాల్లో ప్రతి 2/2 స్కేర్ కిలోమీటర్లకు ఒక వాటర్ పాయింట్ ఏర్పాటు చేయించారు.
ఏడాది పొడువునా ఈ పాయింట్లలో నీళ్లు ఉంటాయి. పులులు తిరిగే అన్ని ప్రాంతాల్లో దాదాపుగా ఈ వాటర్ పాయింట్లు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు గడ్డి మైదానాలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ మైదానాలున్న ప్రాంతంలో శాకాహార జంతువుల సంఖ్య గణనీయంగా పెరిగింది. చుక్కల దుప్పులు, నీల్గాయ్, బ్లూ బక్, అ డవి పందుల సంతతి పెరిగింది. దీంతో పులులు ఉండేందుకు అనువైన వాతావరణం ఏర్పడింది. ఇ టీవల జిల్లాలో పర్యటించిన మేనేజ్మెంట్ ఎఫెక్టివ్నెస్(ఎంఈ) టీం సభ్యులు కూడా మన అడవుల్లో శాకాహార జంతువుల సంఖ్య భారీగా పెరిగాయని నిర్ధారించడం ఆయన పనితనానికి నిదర్శనం.
జన్నారం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ను పులులకు ఆవాసంగా మార్చడమే కాకుండా.. పర్యటకులను ఆకర్శించేందుకు చాలా సంస్కరణలకు శ్రీకారం చుట్టా రు. జన్నారం ఫారెస్ట్ చుట్టూ 30 కిలోమీటర్ల మేర సైక్లింగ్ ట్రాక్ ఏర్పాటు చేయించారు. 30 సైకిళ్లు కొనుగోలు చేసి పర్యాటకులకు, నేచర్ లవర్స్కు కొత్త ప్యాకేజీలు తీసుకురానున్నారు. ఇప్పటికీ సైక్లింగ్ ట్రాక్ పనులు పూర్తయ్యాయి. అతి త్వరలో నే సైక్లింగ్ మొదలుకానుంది. ఇది కాకుండా జన్నారంలో ప్రస్తుతం నడుస్తున్న సఫారీల సంఖ్య ను పెంచారు. ప్రస్తుతం నాలుగు సఫారీలు ఉండగా.. అదనంగా మరో 4 సఫారీలు వస్తున్నాయి.
ప్రస్తు తం సఫారీ ట్రాక్కు అదనంగా మరో మూడింటిని డెవలప్ చేశారు. ఒక్కో సఫారీ వెహికిల్కు రూ.15 లక్షలు ఖర్చు చేసి డిజైన్ చేయిస్తున్నారు. ఇవీ.. మ రో నెలలో అందుబాటులోకి రానున్నాయి. ఇవే కాకుండా అర్బన్ ఫారెస్ట్ పార్క్లను కూడా డెవలప్ చేస్తున్నారు. చెన్నూరు పార్క్ను ప్ర తిష్ఠాత్మకంగా తీసుకొని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ తరహాలో జిల్లాలో మరిన్ని పార్క్లను తీర్చిదిద్దనున్నారు. ఫలితాలను అనుసరించి మరిన్ని సంస్కరణలను తీసుకొచ్చేందుకు ప్రయ త్నం చేస్తానని మంచిర్యాల డీఎఫ్వో శివ్ ఆశిష్ సింగ్ చెబుతున్నాడు.