నార్నూర్, ఫిబ్రవరి 28 : ఆదివాసులు విద్య కు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. గాదిగూడ మండలంలోని దాబా(బీ) పంచాయతీ పరిధిలోని పౌన్నూర్లో ఎస్పీ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఎ స్పీ ముఖ్య అతిథిగా పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. 200 మంది వైద్య నిపుణులతో పరీక్షలు నిర్వహించి మందులు ఉచితం గా పంపిణీ చేశారు. మార్చి 10వ తేదీన నిర్వహించే మెగా జాబ్మేళాను నిరుద్యోగులు స ద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.
కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ ప్రసాద్, ఎస్సైలు పీ.ప్రణయ్కుమార్, శ్రీసాయి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వైద్యాధికారి శరత్రెడ్డి, సందీప్రెడ్డి, చంద్రశేఖర్, వివేక్, విజయరాహుల్, రాహుల్ పుష్కర్, సందీప్రెడ్డి, సిద్ధార్థ్, ఆనంద్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, పోలీసు వైద్య బృంద సభ్యుడు శాంతారాజ్, సర్పంచ్ కొడప కాన్ను, మాజీ వైస్ ఎంపీపీ మర్సివనే మోగేశ్, ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు పెందోర్ సంతోష్, సోనేరావ్ పాల్గొన్నారు