బోథ్, జనవరి 29: ‘పోచమ్మ తల్లీ.. చల్లంగ చూడమ్మా’ అంటూ ఆదివారం మహిళలు చలి బోనాలు వేశారు. బోథ్, సొనాల, కౌఠ (బీ), ధన్నూర్ (బీ), కుచ్లాపూర్, పొచ్చెర, మర్లపెల్లి, కన్గుట్ట తదితర గ్రామాల్లోని మహాలక్ష్మీ పోచమ్మ, ఊర పోచమ్మ, ముత్యాల పోచమ్మ, సార్గమ్మ పోచమ్మ తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తల్లీ చల్లంగా చూడమ్మా అంటూ రాత్రి పూట వండి ఉంచిన బోనాలను నైవేద్యంగా సమర్పించారు. ఆయా గ్రామాల్లో ఆలయాల వద్ద బోనాలు సమర్పించేందుకు మహిళలు బారులు తీరి కనిపించారు.
నిర్మల్ అర్బన్, జనవరి 29 : నిర్మల్ పట్టణంలోని 42 వార్డుల్లో చలి బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని శాంతినగర్ పోచమ్మ ఆలయం, శాస్త్రీనగర్ మారెమ్మ ఆల యం, బంగల్పేట్ పోచమ్మ ఆలయాల్లో భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు తీ ర్చుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
సోన్, జనవరి 29 : నిర్మల్, సోన్ మండలాల్లోని ఆయా గ్రామాల్లో పోచమ్మ తల్లికి చలి బో నాలు సమర్పించారు. నిర్మల్ మండలంలోని వెం గ్వాపేట్, నీలాయిపేట్, మేడిపెల్లి, అనంతపేట్, డ్యాంగాపూర్, సోన్ మండలంలోని సిద్దులకుంట, న్యూవెల్మల్ బొప్పారం తదితర గ్రామాల్లో మహిళలు చలి బోనాలను శనివారం రాత్రి వండి ఆదివారం ఉదయం పోచమ్మకు నైవేద్యంగా సమర్పించారు. ప్రతియేటా పోచమ్మకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ.
మామడ, జనవరి 29 : మండలంలోని పొన్కల్, బండల్ ఖానాపూర్, కొరిటికల్, న్యూలింగంపెల్లి తదితర గ్రామాల్లో బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. కొత్త కుండలో తయారుచేసిన నైవేద్యాన్ని పోచమ్మకు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో సహపంక్తి భోజనాలు చేశారు.
ఖానాపూర్ టౌన్, జనవరి 29 : పట్టణంలోని పలు కాలనీల మహిళలు భక్తి శ్రద్ధలతో శ్రీముత్యాల పోచమ్మ అమ్మవారికి చలిబోనాలు సమర్పించారు. ఆముదపు చెట్ల ఆకుల్లో వండిన బోనాలు, పుట్నాలు, బెల్లం, పెరుగు, ఓమతో పాటు నైవేద్యాన్ని సమర్పించారు. మున్సిపాలిటీలోని 12 వార్డుల నుంచి మహిళలు శాంతినగర్ కాలనీలోని శ్రీ ముత్యాల పోచమ్మ ఆలయానికి తరలివచ్చారు.
భైంసా, జనవరి 29 : భైంసా పట్టణంలో బోనాల పండుగ సందర్భంగా హిమ్మత్రావు తోటలో ఉన్న పోచమ్మ ఆలయం, దగ్గులవ్వ, మార్కెట్ యార్డులో ఉన్న మహాలక్ష్మీ పోచమ్మ ఆలయం మహిళా భక్తులతో కిక్కిరిశాయి. ఉద యం నుంచే మహిళలు బోనాలు సమర్పించి పూ జలు చేశారు. మొక్కులు తీర్చుకున్నారు.
దస్తురాబాద్, జనవరి 29 : మండల కేంద్రం తో పాటు మండలంలో ని ఆయా గ్రామాల్లో ఉన్న పోచమ్మ ఆలయాల్లో మహిళలు చలి బోనాలు స మర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మ హిళలు ఉదయమే ఒక బుట్టలో బోనాలను ఉంచి పోచమ్మ ఆలయాలకు చేరుకొని సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకున్నారు.
ఉట్నూర్, జనవరి 29 : ఉట్నూర్ మండలకేంద్రంలో మహిళలు పెద్ద ఎత్తున పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్బంగా స్థానిక పోచమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక పూజలు ఏర్పాటుచేశారు. దీంతో ఆలయ ప్రాంగణం మహిళా భక్తులతో కిటకిటలాడింది.