ఎదులాపురం, నవంబర్ 23 : క్రీడల్లో ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి ఎదగాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో బుధవారం నిర్వహించిన సౌత్ జోన్ జిల్లా స్థాయి 1,2,3, లెవెల్స్ జోనల్ స్విమ్మింగ్ పోటీలను ప్రారంభించారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు మెమెంటోలతో పాటు మెడల్స్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య రక్షణతో పాటు ఆహ్లాదాన్ని అందించడంలో స్విమ్మింగ్ ఎంతో దోహదపడుతుందన్నారు. జైనథ్ మండలంలో రూ.3.50 కోట్లతో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేసిన ఎమ్మెల్యే జోగు రామన్న, మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ధన్యవాదాలు తెలిపారు. ఆదిలాబాద్లో క్రీడామైదానాలు ఏర్పాటు చేస్తూ వసతులు కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీవైఎస్వో వెంకటేశ్వర్లు, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి, గిరిజన క్రీడాధికారి పార్థసారథి, కార్యదర్శి మహేశ్కుమార్, కోచ్లు కొమ్ము కృష్ణ, చంద్రకాంత్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు దమ్మపాల్, భూమన్న, ఉదయ్ పాల్గొన్నారు.