చెన్నూర్, మార్చి 15: చెన్నూర్ పట్టణంలో ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. మార్నింగ్ వాక్లో భాగంగా పట్టణంలోని కూరగాయల మార్కెట్, బలిజవాడ, బొక్కలగూడెం, బెస్తవాడ, మహంకాళి వాడల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. వార్డుల్లో సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, కౌన్సిలర్ పోగుల సతీశ్, మున్సిపాలిటీ కమిషనర్ గంగాధర్, కాంగ్రెస్ నాయకులు సుశీల్కుమార్, చింతల శ్రీనివాస్, పెద్దింటి శ్రీనివాస్, హిమంత్రెడ్డి, భానేశ్, చెన్న వెంకటేశ్, చెన్నూరి రాజేశ్, బొడ్డు రాకేశ్, పబ్బ సంతోష్, బొమ్మ రమేశ్రెడ్డి తదితరులున్నారు.
భీమారం, మర్చి 15 మండంలోని నేషనల్ హైవే నుంచి రైతు వేదిక వరకు సీసీ రోడ్డు పనులను చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు. మండలంలో నీటి ఎద్దడి ఉందని బోర్లు వేయాలని, గ్రామాల్లో సీసీ రోడ్లు వేయాలని మండల నాయకులు పో డెటి రవి వివేక్ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు ఎమ్మెల్యే చేపడుతామని హామీ ఇచ్చారు. అనంతరం పో డెటి రవి దంపతుల వివాహ వార్షికోత్సవం కాగా వారి ఇంటికి వెళ్లి శాలువాలతో వివేక్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బొల్లం శ్రీనివాస్, ఉష్కమల్ల శ్రీనివాస్, కట్కూరి ప్రకాశ్ రెడ్డి, గుండు తిరుపతి, యువజన నాయకులు అర్కల రమేశ్, శ్రీనివాస్ తదితరులున్నారు.
రామకృష్ణాపూర్, మార్చి 15: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు సాయి కుటీర్ ఏరియాలో సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శుక్రవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు (గద్దెరాగడి) సాయి కుటీర్లో రూ.18.8 లక్షల స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్తో 160 మీటర్ల సీసీ రోడ్డు, సైడ్ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభించారు. 3వ వార్డులో బీ జోన్ పోచమ్మ బస్తీలో లక్ష రూపాయల జనరల్ ఫండ్తో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 7వ వార్డు కౌన్సిలర్ పొలం సత్యం, మున్సిపల్ చైర్ పర్సన్ కళ, వైస్ చైర్మన్ సాగర్రెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపతి రాజయ్య, సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్, ఆకుల రాజన్న, మంద సమ్మయ్య, పలిగిరి కనకరాజు, ఆయా వార్డుల ప్రజలు పాల్గొన్నారు.