ఉట్నూర్/ఆసిఫాబాద్, నవంబర్ 4 : కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. ఆసిఫాబాద్ నియోజవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తానని ఆశించి నిరాశ ఎదుర్కొన్న టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్సుకోల సరస్వతి.., ఆదివాసులకు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన్యమివ్వకపోవడంతో తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు బుర్స పోచ్చయ్య.., ఉట్నూర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కొట్నాక రమేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పుర్క బాపురావ్, సీనియర్ నాయకులు మంగం విషంరావు, అర్క సీతారాం, అడ్వకేట్ పెందూర్ ప్రభాకర్ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. గతంలో పెందూర్ పుష్పారాణి, పలువురు చేరగా, తాజాగా వీరు శనివారం హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గిరిజనుల చిరకాల స్వప్నం పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మిని భారీ మెజార్టీతో గెలుపుంచుకోవాలని సూచించారు. వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, సీఎం కేసీఆర్ అధ్వర్యంలో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని పేర్కొన్నారు. ఆదివాసుల ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. 70 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి బీఆర్ఎస్ చేసి చూపించిందని, అందుకే బీఆర్ఎస్లో చేరుతున్నట్లు పేర్కొన్నారు.
గిరిజన గ్రామాలకు తాగునీరు, బీటీ రోడ్లు వేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. వావనాటే మావరాజ్ కావాలని కోరే ఆదివాసులకు 500 జనాభా గల గ్రామాలను పంచాయతీలుగా మా ర్చి, స్థానిక యువతకు నాయకత్వం అందించార ని, దండారీలకు రూ.10 వేలు, ఆదివాసీ దేవాలయాలకు నిధులు, కెస్లాపూర్కు నిధులు, కుమ్రం భీం జోడేఘాట్లో మ్యూజియం, గిరిజన గ్రామాలకు మంచినీరు, గిరిజనుల స్వప్నం పోడు ప ట్టాలు ఇవ్వడంతోపాటు, రైతు బంధు, రైతు బీ మా అందించారని, గిరిజన రిజర్వేషన్ పెంచారని వెల్లడించారు. అలాగే జీవో నంబర్ 3 పునరుద్ధరించాలని, ఐటీడీఏ ఆధ్వర్యంలో డీఎస్సీ వేయాలని, ఉద్యోగాలు ఆదివాసీ యువతతో భర్తీ చేయాలని మంత్రి కేటీఆర్ను కోరినట్లు వారు తెలిపారు. అడకగకముందే ఎన్నో చేసిన సీఎం కేసీఆర్.. మరిన్ని చేసి, ఆదివాసుల అభ్యున్నతికి కృషి చేస్తారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి అరిగెల నాగేశ్వర్రావు, నాయకులు అబ్దుల్లా, ఆత్రం వినోద్ తదితరులు పాల్గొన్నారు.
ఆసిఫాబాద్ టౌన్, నవంబర్ 4 : బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టో తనను పార్టీలో చేరేలా చేసిందని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్సుకోల సరస్వతి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన అనంతరం, ఆమె మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టి, చేస్తున్న అభివృదిధ, సంక్షేమ పథకాలు, ఇటీవల ప్రకటించిన మ్యానిఫెస్టోకు ఆకర్షితురాలినయ్యే పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవ లక్ష్మిని భారీ మేజార్టీతో గెలిపించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.