నిర్మల్ అర్బన్, సెప్టెంబర్ 10 : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందని, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావనను అలవర్చుకోవాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పట్టణంలోని నాయుడివాడలో రూ.10 లక్షలతో నిర్మించిన గుట్ట వీరాంజనేయ ఆలయం, రూ.17 లక్షలతో నిర్మించిన వీరాంజనే యనేయ స్వామి ఆలయం, రూ.21 లక్షలతో ని ర్మించిన కల్యాణ మండపాన్ని ఆదివారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నిర్మల్ జిల్లాలో ఎన్నో దేవాలయాలను నిర్మించుకున్నామని చెప్పారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మంత్రి, చైర్మన్ ఈశ్వర్ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ముడుసు సత్యనారాయణ, నాయకులు తదితరులు పాల్గొన్నారు.