ఉట్నూర్ రూరల్, ఫిబ్రవరి 3 : ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావును ప్రగతి భవన్లో శుక్రవారం రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొరెంగ దౌలత్రావ్ మెకాసి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగం విషంరావ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆదివాసులైన గోండ్, కొలాం, ప్రధాన్, తోటి, మన్నేవార్, కోయ, ఆంధ్, నాయక్పోడ్ మొదలగు తెగల వారు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పలు సమస్యలపై వినతిపత్రం అందించారు. అలాగే రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావును కలిసి గర్భిణుల మరణాలు, వర్షాలతో దెబ్బతిన్న రోడ్ల నిర్మాణం, జంగో లింగో దీక్షలకు ప్రత్యేక నిధులు, గోండ్ ధర్మ కోయ పున్నెం కోడ్, ప్రత్యేక డీఎస్సీ, పోడు భూముల సమస్యలు, వైద్యం, గిరిజన యూనివర్సిటీ, వ్యవసాయానికి ప్రాజెక్టులు వంటి సమస్యలపై విన్నవించారు. వారి వెంట ఆదివాసీ నాయకులున్నారు.