నేరడిగొండ, మే 28 : వాంకిడి పరిధిలోని గ్రామాల్లో తరచూ కరెంటు సమస్యలు తలెత్తకుండ చేయడానికే విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే జాదవ్ అనిల్ అన్నారు. వాంకిడి గ్రామ సమీపంలో విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటునకు స్థలాన్ని మంగళవారం గ్రామస్తులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. ఇక్కడ సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తే విద్యుత్ సమస్యలు తొలిగిపోతాయని పేర్కొన్నారు. అందుకు ప్రభుత్వానికి నివేదించడం జరిగిందని, త్వరలోనే సబ్స్టేషన్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అనంతరం రాజురా గ్రామం వద్ద నిర్మిస్తున్న లో-లెవల్ వంతెన పనులను పరిశీలించారు. గ్రామస్తులకు ఇబ్బందులు కలుగకుండ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని సూచించారు. అనంతరం రాజురా గ్రామంలో నిర్మిస్తున్న పాఠశాల భవన నిర్మాణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు, సవాయిరాం, నాయకులు శ్రీనివాస్, రాథోడ్ రవీందర్, జాదవ్ వసంత్రావ్, జాదవ్ గణేశ్, అధికారి భీంరావ్ పాల్గొన్నారు.
ఐటీడీఏ పీవోకు ఆదుకోవాలని లేఖ
ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తలమడుగు మండలంలోని పలు గ్రామాల్లో ఆస్తి నష్టం జరిగి నష్టపోయిన కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మంగళవారం ఐటీడీఏ పీవోకు లేఖ రాసి నష్టపోయిన బాధితులకు తక్షణ సహాయం అందించాలని కోరారు. ఉమ్రి, దహెగావ్, మందగూడ, పునగూడ, కప్పర్ దేవి, పల్సి తాండల్లో ఈదురు గాలులతో నష్టపోయిన కుటుంబాలను ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనులను ఆదుకోవాలని లేఖలో కోరారు.