భీంపూర్, డిసెంబర్ 23 : పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. తాంసి మండలంలోని బండలనాగాపూర్, కప్పర్ల ప్రాథమిక , ఉన్నత పాఠశాలలను శుక్రవారం సందర్శించారు. మధ్యాహ్నం భోజనం, వంట గదులను పరిశీలించారు. టెన్త్ క్లాస్ సిలబస్ ఏ మేరకు పూర్తయ్యిందని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.
‘మనఊరు -మనబడి’ పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. అలాగే మత్తడి వాగు ప్రాజెక్టుకు మరమ్మతులు చేపట్టి యాసంగి పంటలకు సాగునీరు అందేలా చూడాలని రైతులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఆమె వెంట డీఈవో ప్రణీత, ఎంపీడీవో ఆకుల భూమయ్య, సర్పంచ్లు గంగు ల వెంకన్న, కేమ సదానందం , ఎంపీటీసీ కౌడాల భాగ్యలక్ష్మి , నాయకులు సంతోష్, మాజీ జడ్పీటీసీ పులి నారాయణ తదితరులు ఉన్నారు.
పనులు వేగవంతం చేయాలి
బోథ్ డిసెంబర్ 23 : ‘మన ఊరు-మన బడి’ ప నులు వేగవంతం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. తలమడుగు మండలంలోని కుచ్లాపూర్ ఉన్నత పాఠశాలలో పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పలు రికార్డులు పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధన తీ రును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వి ద్యార్థులు ఇంగ్లిష్లో పాఠాలు చదవడంతో సం తృప్తి వ్యక్తం చేశారు. అనతంతరం ఆమె మాట్లాడుతూ విడతల వారీగా పాఠశాలను ఎంపిక చేసి పనులు చేపడుతామన్నారు.
విద్యార్థులు కష్టపడి చదివి పదో తరగతి పరీక్షల్లో జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాక్షించారు. చదువులో వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆమె వెంట డీఈవో ప్రణీత, తహసీల్దార్ ఇమ్రాన్ ఖాన్, ఎంపీడీవో రమాకాంత్, ఎంఈవో నారాయణ, ఎంపీపీ కల్యాణం లక్ష్మీరాజేశ్వర్, సర్పంచ్ మోహిత ప్రభ, ప్రధానోపాధ్యాయులు రాజ శంకర్, పాఠశాల చైర్మన్ వెంకన్న యాదవ్ పాల్గొన్నారు.