ఆసిఫాబాద్,మార్చి29 : జిల్లా కేంద్రంలోని రోజ్ గార్డెన్లో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముందుగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లింలు ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. దాదాపు 30 ఏళ్లుగా ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు అరిగెల తెలిపారు.
హనుమాన్ దీక్షా పరులకు సైతం భిక్ష ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎంపీపీ మల్లికార్జున్ యాద వ్, సింగిల్ విండో చైర్మన్ అలీబిన్హైమద్, నాయకులు సాయిని రాజశేఖర్, రహెమాన్, నిజాం, ఇర్ఫాన్, నిసార్, ముషీర్, హైమద్, అమర్, భీమేశ్, ప్రసాద్గౌడ్, వెంకన్న, రాముగౌడ్ తదితరులు ఉన్నారు.