మంచిర్యాల, మార్చి 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పెద్దపల్లి ఎంపీ టికెట్ గడ్డం వంశీకే వస్తున్నదని పెట్టుకున్న ఆశలన్నీ గల్లంతయ్యే లా కనిపిస్తున్నాయి. గడ్డం వివేక్ వెంకటస్వా మి అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్లో చేరే ముందే పెద్దపల్లి ఎంపీ టికెట్ ఆయన కొడుకు వంశీకి ఇస్తామని అధిష్టానం నుంచి కమిట్మెంట్ వచ్చినట్లు చెప్పారు. రేపో, మాపో ఎన్నికల నగారా మోగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. దీంతో గడ్డం ఫ్యామిలీ అయోమయంలో పడింది. మాజీ ఎంపీ సుగుణ కుమారికి టికెట్ ఇప్పించేందుకు మంత్రి శ్రీధర్బాబు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఈ మేరకు పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకువెళ్లి అధిష్ఠానంతో మంతనాలు చేసినట్లు సమాచారం. వాస్తవానికి పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలైన చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు తప్ప ఎవ్వరు కూడా వంశీకి సపోర్ట్ చే యడం లేదని తెలిసింది.
టికెట్పై రేవంత్రెడ్డి, కాంగ్రెస్ అధిష్టానం నుంచి కమిట్మెంట్ ఉ న్నదని చెప్పుకుంటున్న గడ్డం సోదరులు, ఇ ప్పటికే వంశీని ఎంపీ అభ్యర్థిగా ఎస్టాబ్లిష్ చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. గడ్డం వెంకటస్వామి(కాక) పేరుపై ఇటీవలే పార్లమెంట్ నియోజకవర్గవ్యాప్తంగా క్రికెట్ లీగ్ను నిర్వహించారు. లక్షల రూపాయల ప్రైజ్మనీగా యూత్లో గుర్తింపు పొందాలని చూశారు. కానీ.. ఉన్నఫలంగా తెరపైకి కొత్త వ్యక్తి పేరు రావడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితులు నెలకున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి ఎంపీ అభ్యర్థుల జాబితాలో పెద్దపల్లి లేకపోవడం ఇప్పు డు చర్చనీయాంశంగా మారింది. గడ్డం వంశీ కి టికెట్ ఇస్తామనే హామీ ఉన్నప్పుడు ఫస్ట్ లిస్ట్లోనే పేరు వచ్చేది కదా? అందులో పేరు లేదంటే వేరే వారికి టికెట్ ఇచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు. పెద్దాయన గడ్డం వెంకటస్వామిని చూసి వీళ్లని భరించడం తప్ప ఎంపీగా వివేక్ ఉన్నప్పుడు ఒరగబెట్టింది ఏం లేదనే అభిప్రా యం జనంలో బలంగా ఉంది. మరోవైపు ప్ర స్తుత సిట్టింగ్ ఎంపీ వెంకటేశ్ నేతకాని కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఆయన వర్గం కూ డా టికెట్ మాకే ఇస్తారంటూ ప్రచారం చేసుకుంటున్నది. అలాగే.. కాంగ్రెస్ సీనియర్ నా యకులు ఆసంపల్లి శ్రీనివాస్, రామిండ్ల రాధి క కూడా మాకే టికెట్ వస్తున్నదనే ధీమాతో ఉన్నారు. ఇలా ఎవరికీ వారు పెద్దపల్లి ఎంపీ గా పోటీ చేద్దామని చూస్తున్నారు. దీంతో వం శీకి అడ్డంకులు ఎక్కువైపోయాయి. కాగా.. గడ్డం వివేక్ ఎమ్మెల్యేలను ఎవ్వరిని పట్టించుకోకపోవడం కూడా వారంతా వేరే వాళ్లపైపు మొగ్గు చూపేందుకు కారణమైనట్లు తెలుస్తున్నది.
వంశీ ఎంపీగా గెలిస్తే రాజకీయంగా తన కు ఇబ్బందులు ఎక్కువైపోతాయని మంత్రి శ్రీధర్బాబు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే మంత్రి పదవి విషయంలో ఏర్పడిన బేధాభిప్రాయాలు వివేక్ సోదరుడైన బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సపోర్ట్ చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలా పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలందరూ గడ్డం వంశీకి వ్యతిరేకంగా ఉండడంతో ఎంపీ టికెట్ అవకాశాలు దాదాపు చేయిజారిపోయినట్లననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అధిష్టానం ఎమ్మెల్యేల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకుంటే వంశీ ఎంపీ టికెట్ ఆశలు గల్లంతవడం ఖాయంగా కనిపిస్తున్నది.