ఆసిఫాబాద్ టౌన్, జనవరి16 : జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ ఆదర్శ క్రీడా బాలికల పాఠశాలలో నిర్వహిస్తున్న 45వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అండర్-19 బాలికల హ్యాండ్ బాల్ పోటీలు మంగళవారం ముగిశాయి. రాష్ట్ర హ్యాండ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శి సామల పవన్కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేశ్, క్రీడా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కృష్ణారావు మా ట్లాడుతూ జిల్లా కేంద్రంలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించినందుకు సంతోషంగా ఉందన్నారు. రంగారెడ్డి జట్టు విజేతగా నిలువగా, వరంగల్ జట్టు ద్వితీయ స్థానంలో, ఆదిలాబాద్ జట్టు తృతీయ స్థానంలో నిలిచింది.
ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు బిహార్ రాష్ట్రంలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో ఈ క్రీడాకారులు పాల్గొంటారన్నారు. గెలుపొందిన జట్లను హ్యాండ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు గోనే శ్యామ్ సుందర్ రావు, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు రమాదేవి, జిల్లా గిరిజన క్రీడల అధికారి మీనారెడ్డి, జీసీడీవో శకుంతల, ఏసీఎంవో ఉద్ధవ్ అభినందించారు. ఈ కార్యక్రమంలో హ్యాండ్ బాల్ సంఘం వివిధ జిల్లాల కార్యదర్శులు లక్ష్మణ్, శంకర్, తిరుమల్, టోర్నమెంట్ పర్యవేక్షకుడు దీపక్ ప్రసాద్, తెలంగాణ రెఫరీ బోర్డు చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, టోర్నమెంట్ ఆర్గనైజర్లు కడతల రాకేశ్, విష్ణుకాంత్ ఆచార్య, కోచ్లు అరవింద్ సునారర్, సుధీర్, తిరుమల్, మీనా, పద్మిని, పీడీ సదానందం, పీఈటీలు కళ్యాణ్, సాయి, రమేశ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.