మంచిర్యాలటౌన్, మే 9 : మంచిర్యాల జిల్లా కేంద్రంలో సినీ నటి, వీరసింహా రెడ్డి ఫేం హనీరోజ్ సందడి చేసింది. శ్రీ వెంకటేశ్వర షాపింగ్మాల్లో పట్టు పరంపర సేల్స్ను ఎమ్మెల్యే దివాకర్రావు కోడలు ఉదయశ్రీవిజిత్రావుతో కలిసి ప్రారంభించింది. ఆమె రాకతో మార్కెట్ రోడ్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. కాగా, ఈ హీరోయిన్ అభిమానులకు అభివాదం చేస్తూ ర్యాంప్వాక్తో ఉర్రూతలూగించింది. ఈ సందర్భంగా హనీరోజ్ మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలో పట్టుకు ఉన్న విశిష్టత అంతాఇంతా కాదన్నారు.
మహిళలు అత్యంతగా ఇష్టపడే వస్ర్తాల్లో పట్టుకు ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నె న్నో వెరైటీలు, నాణ్యతతో కలిగిన పట్టు వస్ర్తాలు లభించే చోటు వెంకటేశ్వర షాపింగ్ మాలేనని, ఇప్పటికే మహిళలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్న ఈ మాల్లో మరిన్ని వెరైటీలతో పట్టు వస్ర్తాలను అందించడం హర్షించదగ్గ విషయమన్నారు. అనంతరం షాపింగ్మాల్ యజమాని నల్ల రవి మాట్లాడుతూ.. పట్టుపరంపర సేల్స్లో కొత్తగా మూడు మోడల్స్ను ప్రవేశపెట్టామని, అవి మరెక్కడా దొరకవని అన్నారు. అద్వైత పట్టు, త్రినయ పట్టు, చతుర పట్టు మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటాయని, వస్త్ర రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నామని పేర్కొన్నారు.
మహానగరాలతో పాటు పోటీపడి అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన, నమ్మకమైన వస్ర్తాలను సరసమైన ధరలకు అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్రావు, మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వ్యాపార సంఘాల నాయకులు మంగీలాల్సోమాని, గుండ సుధాకర్, సుధాకర్, బీఆర్ఎస్ నాయకులు పల్లపు తిరుపతి, అత్తి సరోజ, గాదె సత్యం, హరికృష్ణ, అంకం నరేశ్, పోరెడ్డి రాజు, గౌసొద్దీన్, తాజొద్దీన్, సుంకరి రమేశ్, కొండాల్రావు, నాంపల్లి శ్రీనివాస్, షాపింగ్మాల్ యజమానులు నల్ల వెంకటనారాయణ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.