దండేపల్లి, మార్చి 4 : అక్రమ దందాలపై ప్రత్యేక నిఘా పెట్టామని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని, పీడీ యాక్ట్ అమలు చేస్తామని రామగుండ పోలీసు కమిషనర్ ఎం. శ్రీనివాసులు హెచ్చరించారు. దండేపల్లి పోలీస్స్టేషన్ను సోమవారం తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ అశోక్కుమార్, ఏసీపీ ప్రకాశ్, సీఐ నరేందర్, ఏఎస్ఐ పాల్ ఉన్నారు.
జన్నారం, మార్చి 4 : రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని పోలీస్స్టేషన్ను తనిఖీ చేశారు. పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఏసీపీ ప్రకాశ్, డీసీపీ అశోక్కుమార్, లక్షెటిపేట సీఐ నరేందర్, ఎస్ఐ సతీశ్ ఉన్నారు.
హాజీపూర్, మార్చి 4 : హాజీపూర్ పోలీస్స్టేషన్ను సోమవారం సీపీ శ్రీనివాసులు (ఐజీ), మంచిర్యాల డీసీపీ అశోక్కుమార్, ఏసీపీ ప్రకాశ్తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఫిర్యాదుల ఆన్లైన్ నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అంకిత భావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఎస్ఐకి సూచించారు. మంచిర్యాల రూరల్ సీఐ ఆకుల అశోక్ ఉన్నారు.
లక్షెట్టిపేట, మార్చి 4 : పట్టణ పోలీస్ స్టేషన్ను సోమవారం సీపీ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పోలీసుల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అక్రమ దందాలు మానుకోవాలని, లేదంటే పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసు బందోబస్తు మధ్య ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డీసీపీ అశోక్కుమార్, ఏసీపీ ప్రకాశ్, సీఐ నరేందర్, ఎస్ఐలు చంద్రకుమార్, రామయ్య ఉన్నారు.
మంచిర్యాల అర్బన్, మార్చి 4 : ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షా కేంద్రాన్ని సోమవారం రామగుండం సీపీ శ్రీనివాసులు పరిశీలించారు. మంచిర్యాలలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడారు. పలు సూచనలు చేశారు. మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, ఏసీపీ ఆర్ ప్రకాశ్, పట్టణ ఇన్స్పెక్టర్ రవీందర్ ఉన్నారు.
సీసీసీ నస్పూర్, మార్చి 4: పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించి, వారికి న్యాయం జరిగేలా చూడాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం సీసీసీ నస్పూర్ పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించిన అనంతరం స్టేషన్ రికార్డులను పరిశీలించారు. మంచిర్యాల డీసీపీ అశోక్కుమార్, ఏసీపీ ప్రకాశ్, సీఐ అశోక్కుమార్, ఎస్ఐ రవికుమార్ ఉన్నారు.