తెలంగాణ ఏర్పాటు తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ పట్టింది. రాష్ట్ర సర్కారు విశాలమైన తరగతి గదుల్లో ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన, నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నది. శిథిలావస్థకు చేరిన భవనాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ‘మన ఊరు-మన బడి’ రూపొందించింది. అందులో భాగంగా న్యూ లోలం ప్రాథమిక పాఠశాలను ఎంపికచేసింది. రూ.1.70 కోట్లు మంజూరుచేసింది.
– దిలావర్పూర్, అక్టోబర్ 25
న్యూ లోలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గ్రామం ఏర్పడినప్పుడు నిర్మించారు. ప్రస్తుతం శి థిలావస్థకు చేరుకున్నది. ఉమ్మడి రాష్ట్రంలో అనేకసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదు. వర్షం పడినప్పుడు, ఎండలకు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులుపడేవారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ పరిస్థితి మారింది. రాష్ట్ర ప్రభుత్వం సర్కారు పాఠశాలలను ప్రైవేటుకు దీటు గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ‘మన ఊరు-మన బ డి’ రూపొందించింది. ఈ క్రమంలో సర్పంచ్ ఓ డ్నం సవిత, గ్రామస్తులు పాఠశాల పరిస్థితి గు రించి రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదా య శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాల అభివృద్ధి కోసం రూ.1.70 కోట్లు మంజూరు చేయించారు. ఆధునిక హంగులతో 8 గదులు గల భవనం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. టెండర్లు పూర్తిగానే మంత్రి ఆదేశాల మేరకు పనులు చేపట్టేందుకు అధికారులు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు.
మంత్రి సహకారంతోనే..
మా పాఠశాల పరిస్థితి, విద్యార్థుల కష్టాలను గురించి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. దీంతో పాఠశాల నూతన భవనం నిర్మించేందుకు కోటీ 70 లక్షలు మంజూరు చేయించారు. ఈ పనులు టెండర్లు పూర్తికాగానే ఆధునిక హంగులతో పాఠశాల భవనం నిర్మిస్తాం. మంత్రికి రుణపడి ఉంటాం.
– ఓడ్నం సవిత, సర్పంచ్, న్యూ లోలం
సంతోషంగా ఉంది..
వర్షం పడితే మా బడిలో కూర్చోవడం ఇబ్బందిగా ఉంటుంది. కానీ, ఇప్పుడు గవర్నమెంట్ మా స్కూల్ అభివృద్ధికి నిధులు ఇచ్చిందని తెలిసింది. కొత్తగా భవనం కట్టిస్తున్నారని అంటున్నారు. చాలా సంతోషంగా ఉంది. నేను ఆరోతరగతి చదువుతున్నాను. త్వరగా భవనం పూర్తయితే మంచిగుంటది.
– విష్ణు 6వ తరగతి