అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా అని జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్సీ దండే విఠల్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావుతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీఎం కేసీఆర్ చొరవతో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని కొనియాడారు. కులమతాల మధ్య చిచ్చు పెడుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రగతి ఇలాగే కొనసాగాలంటే రాబోయే ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని, ఇందుకోసం ప్రతి కార్యకర్తా కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ రౌడీయిజంతో ఇక్కడ గెలువాలని చూస్తున్న వారికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.
దండేపల్లి, మే 30 : అభివృద్ధి, సంక్షేమమే బీఆర్ఎస్ ఎజెండా అని, మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్య సాకారం సీఎం కేసీఆర్తోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల జిల్లా ఇన్చార్జి నారదాసు లక్ష్మణ్రావు, ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ముత్యంపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్యే దివాకర్రావుతో కలిసి ముఖ్య అథితులుగా హాజరయ్యారు. వారు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మదిలో పుట్టినవే రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, 24గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దేశాభివృద్ధి కోసం అడుగులు వేస్తున్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఘనత సీఎం కేసీఆర్దేనని, ఆయన సహకారంతో మన రాష్ట్రం దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని కొనియాడారు.
పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారిపోయాయని, నాటి రామరాజ్యాన్ని సీఎం కేసీఆర్ మళ్లీ గుర్తుకు తెస్తున్నారని చెప్పారు. కులమతాల మధ్య చిచ్చు పెడుతూ వైషమ్యాలు రెచ్చగొడుతున్న పార్టీలకు బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు కావడం లేదని ప్రశ్నించారు. సమయం దొరికితే విమర్శించడం తప్ప ప్రతిపక్షాలకు వేరే పనిలేదని తెలిపారు. అన్ని వర్గాలకు మేలు చేయాలనే ఉద్దేశంతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్దేనని చెప్పారు. తొమ్మిదేండ్ల పాలనలో తెలంగాణను దేశంలోనే నంబర్వన్ స్థానంలో నిలిపారని చెప్పుకొచ్చారు. అభివృద్ధి ఇలాగే కొనసాగాలంటే రాబోయే ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగురవేద్దామని, ఇందు కోసం ప్రతి కార్యకర్త ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు.
అనివీతిపరులకు ఇక్కడ స్థానం లేదు
– ఎమ్మెల్యే దివాకర్రావు
మంచిర్యాల నియోజకవర్గంలో అవినీతిపరులు, కబ్జాకోరులకు స్థానం లేదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. రౌడీయిజంతో ఇక్కడ గెలువాలని చూస్తున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. మరోసారి మంచిర్యాల గడ్డపై గులాబీ రెపరెపలు ఖాయమని చెప్పారు. బీఆర్ఎస్ గెలుపు కోసం శ్రేణులంతా కష్టపడాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మనం చేసిన పనుల గురించి వివరిస్తే చాలని, ప్రజలే మనల్ని గుండెల్లో పెట్టుకుంటారన్నారు. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ పార్టీని మరోసారీ ఆశీర్వదించాలని కోరారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ను ఎవ్వరూ ఆపలేరన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో ఆకట్టుకునే ప్రసంగం చేసిన మామిడిపెల్లికి చెందిన కార్యకర్త లంకె సత్యనారాయణను ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే శాలువాతో సన్మానించారు.
ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత తమదేనని చెప్పారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ప్రధాన వీధులన్నీ గులాబీమయమయ్యాయి. ఈ కార్యక్రమంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ గురువయ్య, పీఏసీఎస్ చైర్మన్లు కాసనగొట్టు లింగన్న, సురేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అనిల్, మాజీ ఎంపీపీ బండారి మల్లేశ్, మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేని శ్రీనివాస్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ, నాయకులు ఉన్నారు.